32.2 C
Hyderabad
May 8, 2024 13: 16 PM
Slider నల్గొండ

12న పాఠశాలల, ఇంటర్ కళాశాల బంద్ ను విజయవంతం చేయండి

#inter-college

విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జులై 12న,వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు,ఇంటర్ కళాశాల బంద్ కు పిలుపును ఇచ్చారు. ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని లోని ప్రభుత్వ కళాశాలలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. పి.డి.ఎస్.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం చందర్రావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు న్యాయమైన విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉందని,కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేస్తూ మరోవైపు ప్రైవేటు, కార్పోరేట్ విద్యా రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు.

లక్షల రూపాయల ఫీజులు దోపిడీ ప్రవేటు, కార్పోరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యారంగ సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ ఇవ్వాలిసి ఉండగా 150 రూపాయలు ఉన్న బస్సు పాస్ చార్జీలను 400 పెంచడం వల్ల విద్యార్థులకు పెను భారంగా పడిందని, దీనివల్ల అనేక పేద,బడుగు,బలహీన వర్గ విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొని చదువును మధ్యలోనే వదిలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, తక్షణమే విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు పాసులు ఇచ్చి,ప్రతి గ్రామానికి విద్యార్థుల సమయానుకూలంగా బస్సులను నడపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, పాఠ్యపుస్తకాలను,యూనిఫాం లను తక్షణమే అందించాలని,మన ఊరు మనబడి కార్యక్రమానికి నిధుల కొరత లేకుండా చూసి తక్షణమే 7,000 కోట్ల రూపాయలను విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల అన్నిటికీ మన ఊరు మనబడి కార్యక్రమg వర్తింపజేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసి, పర్యవేక్షణ అధికారులైన డీఈవో, డిప్యూటీ డీఈఓ,ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని అన్నారు.

పాఠశాలల అభివృద్ధి మౌలిక వసతుల కల్పన నియామకాల బడ్జెట్లో సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని గుర్తు చేశారు. తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ విద్యా రంగానికి అధిక బడ్జెట్ కేటాయించి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రైవేటు, కార్పోరేట్ ఫీజుల దోపిడిని అరికట్టి అనుమతులు లేకుండా నడిపిస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకొని,ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసి, విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ లు ఇచ్చి,హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కాస్మోటిక్,మెస్ చార్జీలను పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనానికి నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు రమేష్, నాగేష్,నాగరాజు,చిన్నబాబు,గోపి,మహేష్, సంతోష్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ఇది రాజకీయ పెగాసెస్

Satyam NEWS

బలవంతపు సర్వేను నిలుపుదల చేయాలి

Bhavani

“లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్” అంటున్న ధీరజ అప్పాజీ!!

Bhavani

Leave a Comment