37.2 C
Hyderabad
May 6, 2024 14: 27 PM
Slider సినిమా

వివాదాస్పద న‌టి శ్రీ‌రెడ్డిపై మ‌రో ఫిర్యాదు

srireddy

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ న‌టి శ్రీరెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తనపై అసభ్యకర పోస్టులు పెడుతోందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. కొంతకాలం కిందట టాలీవుడ్ లో చోటుచేసుకున్న అవాంఛనీయ పరిణామాల నేపథ్యంలో శ్రీరెడ్డి చెన్నైకి మకాం మార్చింది.

ఇటీవల కొంతకాలంగా మళ్లీ తనదైన శైలిలో వ్యాఖ్యలు ప్రారంభించింది. తనను తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతుండడంతో భరించలేకపోయిన రాకేశ్ మాస్టర్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది.

Related posts

శవరాజకీయాలు చేస్తున్న జనసేన పవన్ కల్యాణ్

Satyam NEWS

గుజరాత్ లోనూ బ్యాటింగ్ మొదలెట్టిన బీజేపీ

Satyam NEWS

సరదాలు తీర్చుకోవడానికి ఈ ముగ్గురూ ఏం చేస్తారో తెలుసా?

Satyam NEWS

Leave a Comment