37.2 C
Hyderabad
April 26, 2024 20: 12 PM
Slider ప్రకాశం

శవరాజకీయాలు చేస్తున్న జనసేన పవన్ కల్యాణ్

#AnnaRambabu

వెంగయ్య మృతికి తాను కారణం కాదని, జనసేన నేతల ఆరోపణల్లో వాస్తవం లేదని ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలిపారు.

ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, వెంగయ్య మృతికి విచారం వ్యక్తం చేస్తున్నాన్నారు. వ్యక్తిగత కారణాలతో వెంగయ్య చనిపోతే తనకు ఆపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రోడ్డపై రాళ్ల అడ్డంగా పెట్టి తానని అడ్డుకుని.. బలవంతంగా వాహనం నుంచి దింపే ప్రయత్నం చేశారని అన్నా రాంబాబు వివరించారు.

‘‘సింగరపల్లిలో 95 శాతం సిమెంట్ రోడ్లు వేశాం. చందు అనే వ్యక్తి నన్ను అడ్డుకున్నాడు. ఆ సమయంలో వెంగయ్య అక్కడే ఉన్నాడు. వెంగయ్యకు నాకు వివాదం లేదు.. వాగ్వాదం జరగలేదు.

చిన్న వివాదాన్ని ఎడిటింగ్ చేసి దుష్ప్రచారం చేశారు. పవన్‌కల్యాణ్‌లా శవ రాజకీయాలు చేయడం నాకు రాదు. వెంగయ్య మృతికి నేను కారణమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని’’ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సవాల్‌ విసిరారు.

Related posts

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు

Sub Editor

భారతీయ టిఫిన్ ను తక్కువ అంచనా వేయద్దు ఆనంద్ మహీంద్రా

Sub Editor

అనారోగ్యంతో పెద్దమ్మ తల్లి గుడి పూజారి మృతి

Satyam NEWS

Leave a Comment