ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు దొంగలను హైదరాబాద్ లోని కె పి హెచ్ బి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుండి 7 వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ లక్ష్మీ నారాయణ, డి ఐ సైదులు తెలిపారు. బాలరాజు సాయి కిరణ్ పాండు ముగ్గురు స్నేహితులు సరదాలకు అలవాటు పడ్డారు.
దీంతో దొంగతనాలను చేసి సరదాలు తీసుకునేవారు ఈరోజు ఉదయం కె పి హచ్ బి టెంపుల్ బస్ స్టాప్ వద్ద బైక్ పై ఉన్న వీరిని మఫ్టీలో ఉన్న పోలీసులు పట్టుకొని వాహనం పేపర్స్ అడిగారు. అది దొంగిలించింది అని తేలడంతో వారిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళి విచారణ ప్రారంభించారు దీంతోపాటు మొత్తం ఏడు బైకులను దొంగిలించినట్లు వారు అంగీకరించారు.