ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ నేపథ్యంలో హీరో ప్రభాస్తోపాటు మూవీ యూనిట్ తిరుపతికి చేరుకుంది. తెల్లవారుజామునే ప్రభాస్ సంప్రదాయ పంచె కట్టులో తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం గెస్ట్ హౌస్కు రాగా,
ప్రభాస్ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. అతికష్టంమీద ఆయన్ను అక్కడి నుంచి పంపించారు.