37.2 C
Hyderabad
May 2, 2024 14: 57 PM
Slider ముఖ్యంశాలు

పుష్కర జలాలు…సకల పాప హరణం….

#pranahita

పుష్కర జలాలు వల్ల త్రికరనాలతో చేసిన పాపాలు తొలగిపోతాయని వాకర్స్ ఇంటర్నేషనల్102 గవర్నర్ పి.జి.గుప్తా అన్నారు. మీన రాశిలో వొచ్చే ప్రాణహిత నదీ పుష్కరాలు ఎంతో పవిత్రంగా జరుగుతున్నాయని..శారీరక రుగ్మతలు తొలగటానికి పుష్కర స్నానాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.

త్రివేణి సంగమం లో పుష్కర స్నానాలు చేసి తన్మయత్వం పొంది, అనంతరం కాళీశ్వరం లో ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నామని అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ప్రాణహిత నదీ జలాలు వాకర్స్ సభ్యుల శిరస్సు లపై వేశారు.

ప్రాణకోటికి సమస్త మనుగడకు జలమే ఆధారమని అన్నారు. ఎంతో పవిత్రమైన జలాన్ని తల్లిగా ఆరాధించే సంప్రదాయం హిందూ మతం లో అనాది కాలం నుండి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్  అధ్యక్షుడు శాసపు జోగినాయుడు,వాకర్స్ మాజీ గవర్నర్ జి.ఇందిరా ప్రసాద్ దంపతులు, వాకర్స్ ప్రతినిధులు గేదెల వాసుదేవరావు, శాసపు అప్పలనాయుడు, గోలీ ఉమామహేశ్వర రావు,ఎం.మల్లిబాబు, ఎస్.సంజీవరావు, ఎన్. వి.రమణ,సాయిరాం,మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బెట్టింగ్ బంగార్రాజు: కాళ్లపై దెబ్బలు పోలీసులు కొట్టినవా? కాదా?

Satyam NEWS

జగన్ గారూ, హెలికాప్టర్ వద్దండి… కారులో తిరగండి

Satyam NEWS

రోడ్డు విస్తరణ పనులకు స్టాండింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్

Satyam NEWS

Leave a Comment