27.7 C
Hyderabad
May 12, 2024 06: 51 AM
Slider ఖమ్మం

వరదల ప్రత్యేక అధికారిగా ప్రతీక్ జైన్

#Prateek

గోదావరి వరద ప్రభావిత పరివాహక మండలాల్లో వరద సహాయక చర్యలు, చేపట్టాల్సిన రక్షణ చర్యలు పర్యవేక్షణకు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతీక్ జైన్ ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు.

అలాగే ముంపు మండలాలైన చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మరియు పినపాక మండలాల్లో వరద సహాయక చర్యలు పర్యవేక్షణకు సెక్టోరియల్ అధికారులను, మండల ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు చెప్పారు. విధులు కేటాయించిన సెక్టోరియల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.

సెక్టోరియల్ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు ఆయా మండలాల అధికారులను సమన్వయం చేస్తూ ముందుకు పోవాలని చెప్పారు. వరదలు, నిరంతరాయ వర్షాలు వల్ల దెబ్బ తిన్న ఇళ్లు, పంటలు, పశువుల గణన చేపట్టాలని చెప్పారు.

Related posts

కావలి ఎమ్మెల్యేపై ఎస్ సి ఎస్ టి కేసు పెట్టాలి

Bhavani

ఈశాన్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

Satyam NEWS

ఖమ్మంలో నిమజ్జనం సందర్భంగా పటిష్టమైన భద్రత

Satyam NEWS

Leave a Comment