తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను సినిమా టికెట్ల రేటు లాగా పెంచుకుంటూ పోవడం అన్యాయమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. సామాన్య ప్రజల కోసం “సినిమా టికెట్” ల ధరలను సైతం తగ్గిస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు శ్రీవారి దర్శనం టిక్కెట్ల ధరలను పెంచడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అధర్మంగా ఏకపక్ష నిర్ణయాలు ఏమిటీ స్వామీ ఇది మహా అపచారం కాదా అని ఆయన ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల కన్నా అతి ముఖ్యమైన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరలను కూడా తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
previous post