భారత్కు చేరుకున్న జీ20 దేశాల విదేశాంగ మంత్రులకు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. నేడు జీ20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి కలిసి వచ్చే స్ఫూర్తిని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. భారతదేశం గ్లోబల్ సౌత్ వాయిస్ అని ఆయన అన్నారు. జి 20 విదేశాంగ మంత్రుల సమావేశం ప్రారంభానికి ముందు, ఇటీవల టర్కీ మరియు సిరియాలో సంభవించిన భూకంపాలలో మరణించిన వారి కోసం ఒక నిమిషం మౌనం పాటించారు.
జి-20 దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచ దేశాల మధ్య సఖ్యత నేడు సంక్షోభంలో ఉందనే విషయం మనమందరం అంగీకరించాలని అన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత సృష్టించుకున్న గ్లోబల్ గవర్నెన్స్ ఆర్కిటెక్చర్ రెండు పనులను నెరవేర్చడానికి ఉద్దేశించబడింది. మొదటిది పోటీ ప్రయోజనాలను సమతుల్యం చేయడం ద్వారా భవిష్యత్ యుద్ధాలను నిరోధించడం, రెండవది ఉమ్మడి ప్రయోజనాలపై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం. గత కొన్ని సంవత్సరాల ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, మహమ్మారి, తీవ్రవాదం మరియు యుద్ధాల అనుభవం ప్రపంచ పాలన ఈ రెండు లక్ష్యాల ఛేదనలో విఫలమైందని ప్రధాని అన్నారు.
అభివృద్ధి, ఆర్థిక పునరుద్ధరణ, విపత్తు తట్టుకునే శక్తి, ఆర్థిక స్థిరత్వం, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం మరియు ఇంధన భద్రత, అభివృద్ధి వంటి సవాళ్లను తగ్గించేందుకు ప్రపంచం G20 వైపు చూస్తోందని ప్రధాని అన్నారు. వీటన్నింటికీ G20లో ఏకాభిప్రాయం ఏర్పడి ఖచ్చితమైన ఫలితాలను అందించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సమావేశానికి ముందు భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలీనా బీబాక్ తో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఆమె న్యూఢిల్లీ చేరుకున్నారు. సౌదీ అరేబియా, చైనా, ఇండోనేషియా, స్పెయిన్ మరియు క్రొయేషియా విదేశాంగ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడానికి భారతదేశానికి చేరుకున్నారు.