36 C
Hyderabad
May 13, 2025 13: 07 PM
Slider సినిమా

విశ్వవిఖ్యాత గాయకుడిని పిలిచి అవమానించిన ప్రధాని మోడీ

spbalu

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని కొద్దిరోజుల కిందట ప్రధాని నరేంద్రమోడీ తన నివాసంలో చిలన చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర కళాకారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బాలీవుడ్ హీరోలు, పలువురు సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, కంగన రనౌత్, సోనమ్ కపూర్ తదితరులు దీనికి హాజరయ్యాురు. ప్రధాని మోడీతో సెల్ఫీలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. టాలీవుడ్ నుంచి నిర్మాత దిల్ రాజు, లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమంలో దక్షిణాది చిత్ర పరిశ్రమను చిన్నచూపు చూశారని మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఆవేదన వ్యక్తం చేశారు. మోడీని ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారు. దీనిపై చిత్ర పరిశ్రమలో చెలరేగిన దుమారం తగ్గక ముందే ప్రఖ్యాత గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నివాసంలో బాలీవుడ్ స్టార్ హీరోలకు ఒకరకంగా తమ లాంటి కళాకారులను ఇంకోరకంగా ట్రీట్ చేశారని, వివక్షను చూపారని చెప్పారు. ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందే అక్కడి భద్రతా సిబ్బంది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా కొందరు కళాకారులు, చిత్ర పరిశ్రమకు చెందిన టెక్నీషియన్ల సెల్ ఫోన్లను లాక్కుని, టోకెన్లు ఇచ్చారు. భద్రతా చర్యల్లో భాగంగా అందరి సెల్ ఫోన్లను తీసుకుని ఉండొచ్చని తాను భావించానని, తీరా చూస్తే స్టార్ హీరోలు, బాలీవుడ్ కు చెందిన కొందరు సినీ ప్రముఖుల చేతుల్లో సెల్ ఫోన్లు కనిపించాయని అన్నారు. అవే సెల్ ఫోన్లతో బాలీవుడ్ సెలెబ్రెటీలు నరేంద్ర మోడీతో సెల్ఫీలు దిగారని చెప్పారు.

Related posts

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్ జాగిలాలది కీలకపాత్ర

Satyam NEWS

ఫ్లాట్ ఫారం రిక్షా, ట్రాలీ ఆటో కార్మికుల చర్చలు సఫలం

Satyam NEWS

పేపర్ ట్రబుల్: ఆదాయం లేక అగాధంలోకి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!