ప్రతి యూనియన్ సభ్యుడికి యూనియన్ కార్డు, ప్రమాద ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఏ ఐ టి యు సి అనుబంధ సంఘం ప్రైవేట్ ఎలక్ట్రికల్ యూనియన్ అధ్యక్షుడు ములకలపల్లి రాంబాబు అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో గురువారం యూనియన్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ ఒక వర్కర్ చేసిన పనిని మధ్యలో మరొకరు చేయరాదని అన్నారు.
ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కాకుండా సంఘం నుండి కూడా ఆర్థికంగా సహాయం చేయాలని అన్నారు.
ఏ వర్కరుకైనా అన్యాయం జరిగితే యూనియన్ వారికి అండగా ఉంటుందని, యూనియన్ ముందుకు సాగటానికి సభ్యులందరూ సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు ములకలపల్లి శ్రీను, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి సత్యానందం, ఉపాధ్యక్షుడు ములకలపల్లి నరసింహారావు, సహాయ కార్యదర్శి చక్రాల బోసు, వీరబాబు, కోశాధికారి ఎస్ కె. భాష పాల్గొన్నారు.
ఇంకా కార్యవర్గ సభ్యులు ఉండేటి నగేష్, గడ్డం వీరస్వామి, యం. లక్ష్మణరావు, గోపాలపురం వెంకటేశ్వర్లు, నరసింహారావు, టి. అనిల్, హుస్సేన్, రాము తదితరులు కూడా పాల్గొన్నారు.