కరోనా వ్యాధిని అరికట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్టు చేయడాన్ని కొమురంభీం జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, సిర్పూర్ తాలూకా సీనియర్ నాయకులు రావి శ్రీనివాస్ తీవ్రంగా ఆక్షేపించారు. కరోనాపై చర్యలు తీసుకోవడం చేతకాని టీఆర్ఎస్ ప్రభుత్వం అదే మని ప్రశ్నించిన బిజెపి నాయకులను అరెస్టు చేస్తున్నదని వారు అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను వారు తీవ్రంగా ఎండగట్టారు. కరోనా ను తక్షణమే ఆరోగ్య శ్రీ లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. టెస్టింగ్ కేంద్రాలు పెంచి, వ్యాధి నిర్ధారణ చేసే పరీక్షల సంఖ్య ఎక్కువ చేయాలని వారు డిమాండ్ చేశారు.
సిర్పూర్ తాలూకా లో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా, వారిని ఆదుకోకుండా అరెస్టులు చేయించడం అన్యాయమని వారుతెలిపారు. ప్రజా ప్రతినిధులే అరెస్టులను ఉసి కొలుపుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని బిజెపి నేతలు విమర్శించారు.