ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి ఇంటర్మీడియెట్ 2సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు 2లాంగ్వేజ్ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి సెట్ – 1 ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేసినట్టు ఇంటర్ మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు.
కరోనా అనంతరం నిర్వహిస్తున్నఈ పరీక్షలకు 4లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరు కానున్నారు. అన్నిపరీక్షా కేంద్రాల్లోనూ CCTV లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పటిష్ట నిఘాతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు.
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, ఎలాంటి వదంతులు నమ్మరాదని అధికారులు సూచించారు.