హైదరాబాద్ లోని కాచిగూడ డివిజన్ కార్పొరేటర్ కన్నే ఉమారమేష్ యాదవ్, బీ.జే.పీ సీనియర్ నాయకులు కన్నే రమేష్ యాదవ్ తో కలిసి మౌలానా ఆజాద్ నగర్, బండల్ బస్తి ప్రాంతాలలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బండల్ బస్తి అమ్మవారి గుడి దగ్గర ఉన్న మట్టి కుప్పలు ను వెంటనే తొలగించాలని జీ.హెచ్.ఎం.సి ఏఎంహెచ్ఓ జ్యోతి భాయికి తెలియజేశారు. బస్తీలో గల పవర్ బోర్ ను వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రమాదేవి, మురారి, రాజు, రాము, బి.భీమ్ రాజ్, ఆర్.సంతోష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
previous post