కేంద్ర ప్రభుత్వంపై పేద ప్రజల వ్యతిరేకత: నిరసనలో పాల్గొన్న బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
కేంద్ర ప్రభుత్వం సామాన్యుని నడ్డి విరిచేలా గ్యాస్ ధరల పెంపుదలతో బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన నిరసన పిలుపుతో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశానుసారం బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసేలా నిర్ణయాలు తీసుకుంటూ నిత్యావసర వస్తువులు, వంట గ్యాస్ ధరల పెరుగుదలను వ్యతిరేకిస్తూ మిన్నంటిన నిరసనలు తెలియజేస్తూ పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని ఖాళీ వంట గ్యాస్ సిలిండర్లకు నల్లజెండాలు కట్టి,కట్టెల పొయ్యితో వంట చేసి బారి ఎత్తున బిఆర్ఎస్ పార్టీ మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు,నాయకులు పాల్గొని నిరసనగా కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ నిరసన జ్వాలలను తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి,జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ముడెం గోపిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,సీనియర్ నాయకులు గోల్డ్ పిచ్చయ్య,కౌన్సిలర్లు కొమ్మ శ్రీను,జక్కుల శంభయ్య,ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మ వీరారెడ్డి,ములకలపల్లి రామగోపి,చిలకపత్తిని సౌజన్య ధనుంజయ, గుండా ఫణి కుమారి రామిరెడ్డి,వీర్లపాటి త్రివేణి భాస్కర్,అమరబోయిన గంగరాజు, మహిళా కమిటీ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మ రాంరెడ్డి,యువజన కమిటీ అధ్యక్షుడు సోమగాని ప్రదీప్ గౌడ్, టిఆర్ఎస్కెవి అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,చెవుల కవిత,పట్టణం లోని వివిధ వార్డుల అధ్యక్షులు,అనుబంధ సంఘాల నాయకులు,మహిళా నాయకులు,ప్రజలు మహిళా సోదరీమణులు,యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్