33.2 C
Hyderabad
May 4, 2024 01: 49 AM
Slider రంగారెడ్డి

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు

#congress

కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరు ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తలకొండపల్లి మండల కేంద్రం నుంచి వెల్జాల వరకు గత ఐదు సంవత్సరాలుగా కల్వర్టులు రోడ్డు పూర్తిచేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై నిరసన కార్యక్రమాలు ఉంటాయని ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కల్వర్టులు, బ్రిడ్జిలు ,రహదారులు ఘోరంగా తయారయ్యాయని పట్టించుకునే నాధుడే లేడని ఎన్నికల ముందు అది చేస్తా ఇది చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ గొప్పలు చెప్పుకుంటూ అధికారంలోకి రాగానే ప్రజల ఇక్కట్లు పట్టించుకునే రాజకీయ నాయకులే లేరని ఇటువంటి వారిని మళ్లీ అధికారం ఇవ్వకుండా ఓటర్లు జాగ్రత్త వహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి జగదీష్ రెడ్డి వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు

Satyam NEWS

ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఏలూరు మేయర్ అభ్యర్ధి

Satyam NEWS

కిల్లింగ్: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment