కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నవాబ్ వెంచర్ లో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న నవాబ్ వెంచర్ దట్టంగా పొదలతో నిండిపోయింది. ఆ ప్రాంతంలో ఏమి జరిగినా తెలియని పరిస్థితి నెలకొంది. అలాంటి ప్రాంతంలో ఓ గుర్తు తెలియని 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి తలపై బండ రాయితో బాధి హత్య చేసినట్టు తెలుస్తోంది.
పక్కనే బండరాయితో పాటు మృతుడు కిరాణా సామగ్రి కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. కిరాణా సామగ్రి చిందర వందరగా పడి ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటన స్థలాన్ని కామారెడ్డి డిఎస్పీ లక్ష్మీనారాయణ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు