తమ పొలంలోకి వెళ్లకుండా దౌర్జన్యం చేస్తూ దోవ లేకుండా చేస్తున్నారని, ఈ దౌర్జన్యం నుంచి తమను కాపాడేవారే లేరని ముత్యలంపాటి మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయం వద్ద కారంపూడి కి చెందిన ముత్యలంపాటి మల్లికార్జునరావు, పద్మ దంపతులు ఆందోళన చేశారు. ఈ వృద్ధ దంపతులు పురుగుమందు డబ్బుతో సహా ఆందోళనలో పాల్గొన్నారు. తమ రెండు ఏకరాల భూమి లోకి వెళ్లకుండా దోవ అక్రమించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు సార్లు స్పందనకు వచ్చామని, కలెక్టర్ చెప్పినా సమస్య పరిష్కరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
previous post
next post