కార్పొరేట్, బీజీపీ మతోన్మాద విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం అధ్వర్యంలో చేపట్టిన జన చైతన్య యాత్రలో భాగంగా ఖమ్మం నగరం గాంధీ చౌక్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో బిఆర్ఎస్ పార్టీ తరుపున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంఘీభావం తెలిపారు. నేడు దేశంలో నియంతృత పాలన కొనసాగుతుందని, దేశ ప్రజల సంక్షేమాన్ని కొరాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ కు వత్తాసు పలుకుతూ, నవరత్నాలైన కేంద్ర ప్రభుత్వ సంస్థలను అమ్ముకుని పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం మోడీ స్నేహితుడు ఆదాని కోసమే ప్రభుత్వం నడుపుతున్నాడా.. లేక దేశ ప్రజల కోసం ప్రభుత్వం నడుపుతున్నాడా అర్దం కాట్లేదన్నరు. కమ్యూనిస్ట్ పార్టీలు విజిల్ బ్లోవర్ లుగా ఉడాలన్నరు. అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుంది అని అన్నారు. ప్రజాస్వామ్యం, లౌకిక, ఫెడరలిజాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
previous post
next post