28.7 C
Hyderabad
May 5, 2024 09: 19 AM
Slider సినిమా

నష్టాల్లో ఉంటే విశాఖ ఉక్కును ప్రయివేటు వాళ్లు ఎలా నడుపుతారు?

#RPPatnayak

నష్టాల్లో నడుస్తున్నది కాబట్టి విశాఖ ఉక్కును అమ్మేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్ పి పట్నాయక్ వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి ఆయన తన పూర్తి మద్దతు తెలిపారు.

లాస్ లో ఉన్న కంపెనీని ప్రయివేటు వాళ్లు ఎందుకు తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. నష్టాలలో ఉంటే దాన్ని ప్రయివేటు ఎలా నడుపుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రయివేటు వాళ్లు లాస్ లో ఉన్నా నడిపేలా అయితే ఆ పని కేంద్రమే చేయవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

లాస్ లో నడుస్తున్న విశాఖ ఉక్కు ప్రయివేట్ వాళ్లకు ఇవ్వగానే ప్రాఫిట్ లోకి వెళ్తుందంటే మరి ఆ లాజిస్టిక్స్ ఏమిటో స్టడీ చేసి వాటిని ప్రభుత్వమే అమలు చేయవచ్చు కదా అని ఆర్ పి పట్నాయక్ అన్నారు.

విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వారికి ఒక సామాన్య పౌరునిగా రాజకీయ పార్టీలకు అతీతంగా తన సంపూర్ణ మద్దతు తెలియ చేస్తున్నట్లు ఆర్ పి తెలిపారు.

Related posts

తక్షణమే ముఖ్యమంత్రి పదవిని వికేంద్రీకరించాలి

Satyam NEWS

చీరాలలో 471 ఇళ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కరణం

Satyam NEWS

కాంగ్రెస్ చింతన్ శివిర్: కుటుంబానికి ఒకటే టిక్కెట్

Satyam NEWS

Leave a Comment