అత్యద్భుతమైన శిల్ప సంపద కలిగిన రామప్పలో మహాశివరాత్రి జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 11-03-2021 గురువారం నుండి,13-03-2021 శనివారం వరకు రామప్పలో శివరాత్రి జాతర నిర్వహిస్తున్నారు.
పోలీసు, భద్రత , రవాణా, వైద్యం, త్రాగునీరు వివిధ రకాల సదుపాయాలు కల్పించారు. హన్మకొండ, పరకాల భూపాలపల్లి, ములుగు వివిధ ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది.
కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా రామప్ప వచ్చే భక్తులు మాస్కు, శానిటైజర్స్ విధిగా వాడాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం, దేవాదాయ శాఖ భక్తులకు ఏ విధమైన ఇబ్బంది జరగకుండా ఏర్పాట్లు చేస్తోంది.
కార్యక్రమం వివరాలు
11-03-2021 గురువారము— మహాశివరాత్రి, అభిషేకము, రాత్రి పదిగంటలకు కల్యాణమహోత్సవము, జాగరణ, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు.
12-03-2021 శుక్రవారం—- రుద్రాభిషేకము, బలిహరన, దీపోత్సవం.
13-03-2021 శనివారం నాకబలి, గెలుపు, ఆశీర్వచనము,ప్రసాద వినియోగం