37.2 C
Hyderabad
May 2, 2024 12: 17 PM
Slider నల్గొండ

మదర్ సేవ సమితి యూత్ ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం

#MotherSeva

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శ్రీనివాసపురం గ్రామంలో మదర్ సేవా సమితి యూత్ ఆధ్వర్యంలో మంగళవారం A N M, అంగన్వాడీ టీచర్స్, V O A, ఆశా కార్యకర్తలకు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

గ్రామంలో  వారు చేసే సేవలు చాలా బాగున్నాయని,యూత్ అధ్యక్షుడు జింకల కొండల రావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మదర్ సేవా సమితి కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో మహిళలకు గౌరవం ఇవ్వాలని, నేడు శాస్త్ర, సాంకేతిక, విద్యా రంగాలలో మహిళలు రాణిస్తున్నారని, మన గ్రామములోని మహిళలు చదువుతో పాటు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనపర్చి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.మదర్ థెరిస్సా చేసిన సేవలును ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రమ్య నాగరాజు, అంగన్వాడీ టీచర్లు, మంజుల, పార్వతమ్మ, A N M  లు అలివేలు మంగ, మేదరి రాణి, ఆశా కార్యకర్త కమలమ్మ,  V O A సంధ్య,మదర్ సేవా సమితి అధ్యక్షుడు కొండల్ రావు,  కార్యదర్శి శ్రీనివాస్, యూత్ సభ్యులు,గ్రామ పెద్దలు పున్నయ్య ,బాబు,ముత్తయ్య  సంజీవ్ గాంధీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ కేంద్రంగా రూ 700 కోట్లతో స్కై వర్త్ కంపెనీ

Satyam NEWS

ధాన్యం సేకరణ సజావుగా జరగాలి

Satyam NEWS

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంద కృష్ణ మాదిగ

Satyam NEWS

Leave a Comment