రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ విడుదల అయింది. మే 6న సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాహుల్ గాంధీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా హెలికాప్టర్ లో వరంగల్ కు రాహుల్ గాంధీ వెళతారు. వరంగల్ రైతు సంఘర్షణ సభ ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేశారు.
రాహుల్ గాంధీ ముఖ్య నాయకులకు ఒకే వేదిక ఉంటారు. రైతు ఆత్మహత్యల కుటుంబాలకు మరో వేదిక పై ఉంటారు. 7 గంటల వరకు ముఖ్య నేతల ప్రసంగం ఉంటుంది. 7 గంటలకు రాహుల్ ప్రసంగం ప్రారంభం అవుతుంది. సభ తరువాత రాహుల్ గాంధీ రోడ్డు మార్గాన హైదరాబాద్ కు చేరుకోనున్నారు. దుర్గం చెరువు పక్కన ఉన్న ఐటీసీ కోహినూర్ హోటల్ లో రాహుల్ బస చేస్తారు. 7 వ తేదీ ఉదయం హోటల్ కోహినూర్ లో ముఖ్య నాయకులతో అల్పాహారం తీసుకుంటారు. అక్కడి నుండి మొదట సంజీవయ్య పార్క్ కి వెళ్లి నివాళి అర్పిస్తారు. అక్కడ నుండి నేరుగా గాంధీ భవన్ కు రాహుల్ గాంధీ వస్తారు.
అక్కడ దాదాపు 300 మంది ముఖ్య నాయకుల తో సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ డిజిటల్ మెంబర్షిప్ ఎన్ రోలర్స్ తో ఫొటో సెషన్ ఉంటుంది. ఆ తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో రాహుల్ గాంధీ లంచ్ మీటింగ్ ఉంటుంది. అనంతరం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద్వారా ఢిల్లీ కి తిరుగు ప్రయాణమౌతారు.