వివాహేతర సంబంధంతో భార్య నే వద్దనుకుని, చంపేందుకు సిద్ధపడ్డాడు అన్నమయ్య జిల్లా, కలికిరి సైనిక్ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్. బాధితురాలు ఆదివారం తిరుపతిలోని మహిళా కమిషన్ మెంబర్ కార్యాలయానికి చేరుకుని భర్త కారణంగా ఆమెకు జరిగిన వేధింపులు, హత్య ప్రయత్నాలను రాష్ట్ర మహిళా కమిషన్ మెబర్ గజ్జల లక్ష్మి దృష్టికి తీసుకు వచ్చింది.
బాధితురాలికి తగు న్యాయం చేయిస్తామని గజ్జల లక్ష్మి హామీ ఇచ్చారు. వైస్ ప్రిన్సిపల్ భార్య తో పాటు ఇద్దరు పిల్లలను వేధిస్తున్నారని, తాను నరకయాతన అనుభవిస్తున్నా నని బాధితురాలు కంటతడి పెట్టుకుందని గజ్జల లక్ష్మి అన్నారు. వైస్ ప్రిన్సిపాల్ పెడుతున్న వేధింపులు తాళలేక ఆయన భార్య పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని, న్యాయం జరగలేదని మహిళా కమిషన్ మెంబర్ తో తనకు జరిగిన అన్యాయాన్ని తెలిపింది. వివరాలు తెలుసుకున్న మహిళా కమిషన్ మెంబరు బాధితరాలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.