34.7 C
Hyderabad
May 5, 2024 02: 39 AM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి

#kishanreddy

దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన కార్యదర్శి విపిన్ దులియా, కార్యదర్శి పులిపలుపుల ఆనందం, ఐఎఫ్ డబ్ల్యూజే వర్కింగ్ కమిటీ సభ్యులు, టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య తదితరులు శుక్రవారం న్యూఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రైల్వే బోర్డు ఛైర్మన్ జయవర్మ సిన్హా లకు వినతిపత్రాలు సమర్పించారు.

జర్నలిస్టులకు రైలు ప్రయాణంలో చాలా ఏళ్ళుగా అమలవుతున్న  రాయితీ పథకాన్ని గత మూడేళ్ళ క్రితం కరోనా కాలంలో నిలిపివేశారని, దీనివల్ల దేశవ్యాప్తంగా జర్నలిస్టులు వృత్తిపరమైన విధి నిర్వహణలో రైలు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. చాలీచాలని వేతనాలతో విధులు నిర్వహిస్తూ… ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టులకు కల్పించబడిన రైల్వే రాయితీ పాస్ లను రద్దు చేయడం సమంజసం కాదని వారు కోరారు. ఈ విషయమై గతంలో  పలు మార్లు రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందని, ఇప్పటికైనా రైల్వే పాస్ లను పునరుద్ధరించి జర్నలిస్టులకు రైలు ప్రయాణం భారం కాకుండా చూడాలని వారు కోరారు.

ఇదిలా ఉండగా పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, డాక్టర్ కె. లక్ష్మణ్ లను కూడా కలిపి జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్ధరణ అంశాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్ళాలని కోరారు. అదేవిధంగా జర్నలిస్టుల పెన్షన్ స్కీమ్, జర్నలిస్టుల రక్షణ చట్టం తదితర అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి చేయాలని వారు ఎంపీలను కోరారు.

Related posts

2024లో టిడిపి లీడింగ్ వార్తతోనే అరాచకశక్తుల పరార్!

Satyam NEWS

బంగ్లాదేశ్‌ లో ఉల్లిపాయల ధర ఎంతో తెలుసా?

Satyam NEWS

జ‘గన్’ హామీలపై రఘురామ గన్

Satyam NEWS

Leave a Comment