విద్యలనగరం పేరు ను కాస్త..కొంతమంది మందుబాబులు చెడగొడుతున్నారని…గడచిన రెండు రోజుల నుంచీ ట్రాఫిక్ పోలీసులు రాత్రి పూట అకస్మాత్తుగా చేపడుతున్న డ్రంక్ అండ్ డ్రైవ్ లే కారణమంటోంది…ఆన్ లైన్ న్యూస్ లో దూసుకెళుతున్న “సత్యం న్యూస్. నెట్”.ఎస్పీ దీపికా ఆదేశాలు… ట్రాఫిక్ డీఎస్పీ విశ్వనాథ్ సూచనలతో ట్రాఫిక్ ఎస్ఐ లు లోవరాజు ,త్రినాథ్ లతో పాటు ఆర్టీఏ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ దుర్గా ప్రసాద్ లు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ మేరకు విజయనగరం లో సింహాచలం మేడ ,ఆర్టీసీ కాంప్లెక్స్, దాసన్నపేట రైతు బజార్, న్యూపూర్ణ ,వై జంక్షన్, తదితర ప్రదేశాల్లో ఎస్ఐ లు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ లను స్పెషల్ గా చేసారు. ప్రత్యేక మిషన్ తో తనిఖీ లు చేయగా…దాదాపు 400 కు పైగా మద్యం సేవించి నట్లు…కనిపించడంతో తక్షణమే కేసు కట్టి… కోర్ట్ కు పంపించారు. ఏదైనా… కళలకు కాణాచైన ,అలాగే విద్యల నగరంగా ఉండే విజయనగరం ఖ్యాతి ని ఇలాంటి కొందరు అపఖ్యాతి పాలు చేస్తున్నారని సత్యం న్యూస్. నెట్ అంటోంది.
previous post