గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమపాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు పునాది నుంచే విద్యావ్యవస్థ పటిష్ట పరచడానికి అనేక రకాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని దానిని సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి అర్థమయ్యే రీతిలో అక్షరాలు గుర్తించే విధంగా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి ప్రతిక్ జైన్ అన్నారు.
భద్రాచలంలోని రాజుపేట కాలనీలో జిపిఎస్ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థుల యొక్క సామర్ధ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రతి పిల్లవాడితో బోర్డుపై గణిత, చతుర్విధ ప్రక్రియలు, ఇంగ్లీష్, తెలుగు ,చదివించడం బోర్డు మీద రాయించడం చేయించి, పిల్లలు ప్రతి అంశంలో చురుకుగా ఉండడంతో ఉపాధ్యాయులను ఆయన అభినందించి ఇప్పటినుండి ప్రతి పిల్లలు ఇదేవిధంగా అన్ని అంశాలను కులంకషంగా అర్థం చేసుకొని రానున్న తరగతులలో మంచి ప్రావీణ్యత సాధించేలా ఉపాధ్యాయుల కృషి చేయాలని, గ్రీన్ బోర్డును పెయింటింగ్ మంచిగా వేయించాలని సంబంధిత హెచ్ఎం కు తన సొంతంగా 500 రూపాయలు అందజేశారు.ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ, రాజుపేట ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ఎం బాసియా తదితరులు పాల్గొన్నార