మన దేశంలో దిగుబడి లేక ఉల్లి పాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దాంతో బంగ్లా దేశ్ కు భారత్ ఎగుమతులు నిలిపివేసింది. భారత్ నుంచి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్లో కిలో ఉల్లిపాయల ధర రూ.220 కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్, చైనా ల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. పలు ప్రాంతాల్లో ఉల్లి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి కిలో ఉల్లి రూ.38కి అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఉల్లి ధరలు పెరిగిపోయిన నేపథ్యంలో తన నివాసంలో ఉల్లి వాడొద్దని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసినా నిర్ణయం తీసుకున్నారు. భారత్ లోని పలు ప్రాంతాల్లో ఉల్లి కిలో రూ.70 కి చేరింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో ఈ పరిస్థితి వచ్చింది.