అన్నా , చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళ మధ్యన ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగను జరుపుకుంటారని ఏఎస్రావునగర్ డివిజన్ కార్పోరేటర్ కార్పోరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం తన సోదరుడు మల్లయ్యగారి విష్ణువర్ధన్రెడ్డికి రాఖీ కట్టారు.
ఈ సందర్భంగా ఆమే మాట్లాడతూ రాఖీ పండుగను పురస్కరించుకొని అన్నకు గాని ,తమ్మునికి గాని ప్రేమానురాగాల చిహ్నంగా సోదరి కట్టే రాఖీ అనే పట్టీ ని రక్షా కంకణం అని ఈ పండగ ప్రధాన విశేషం అని తెలిపారు.
రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్నా చేల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తరమైన పడుగ. అక్క,చెల్లి తన అన్న,తమ్ముళ్ళు మహోన్నత శిఖరాలకు ఎదగాలని, ఆయురారోగ్యాలతో కలకాలం సుఖసంతోషాలతో విరజిల్లాలని కోరుకుంటూ రాఖీ కట్టి పండుగను జరుపుకుంటారని పేర్కొన్నారు.