హైదరాబాద్ లోని ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన రామంతపూర్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు డా. ఎన్ వి ఎస్. ప్రభాకర్ అన్నారు. గురువారం రామంతపూర్ బొడ్డురాయి 6వ వార్షికోత్సవం సందర్భంగా ఎన్ వి ఎస్. ప్రభాకర్, రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేని చేతన హరీష్ లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ రామంతపూర్ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్ర రాజేశ్వర్,బాబు యాదవ్,గోవర్ధన్ రెడ్డి,మురళి గౌడ్, దయాకర్ రెడ్డి, నందకిశోర్ యాదవ్, సిరిశాల విజయ్ ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి