తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ బాబు పై జరిగిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శుక్రవారం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు ఆధ్వర్యంలో టీడీపి నేతలు మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేశారు.
అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుండి ఆర్ అండ్ బి బంగ్లా వద్ద ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా బత్యాల మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలంలో తుమ్మపూడి గ్రామంలో అత్యాచారానికి గురైన బాధిత కుటుంబానికి అండగా ఉండి వారు ఆర్థికంగా చితికిపోకుండా నష్ట పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడమే కాకుండా పరామర్శించడానికి వచ్చిన మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మేల్సి నారా లోకేష్ బాబు ని వైకాపా గుండాలు ఆడ్డుకొని రాళ్లతో దాడి చేయడం చాలా దారుణమైన విషయం అని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తున్న నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి కి ఎక్కడ మొగుడు అవుతాడో అనే భయంతో లోకేష్ బాబు పైన రాళ్లతో దాడి చేయించి కుట్ర రాజకీయాలను తెరలేపుతున్నారని అన్నారు. దీనికి తగిన మూల్యం వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.
పులివెందులలో జరిగే హత్యా రాజకీయాలను రాష్ట్ర వ్యాప్తంగా పెంచి పోషించి రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారని, కానీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు