మన శత్రువుకైనా సరే కరోనా సోకిందంటే మనం అయ్యో పాపం అంటాం. అది మానవ సహజం. ప్రాణాంతకమైన కరోనా సోకినవారికి సాంత్వన చేకూరాలని దేవుడ్ని ప్రార్థిస్తాం.
అయితే కరడుకట్టిన తీవ్రవాది మనస్తత్వం ఉన్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం హీరో పవన్ కల్యాణ్ కు కరోనా సోకిందంటే సానుభూతి సంగతి పక్కన పెట్టి అవహేళన చేస్తున్నాడు.
పవన్ కల్యాణ్ తనకు కరోనా సోకిందని ప్రకటించి, తాను తన ఫామ్ హౌస్ లో చికిత్స తీసుకుంటున్న ఫొటోను విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ కు కరోనా సోకిన నాటి నుంచి రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా అమానవీయ కామెంట్లు పెడుతూనే ఉన్నాడు.
తాజాగా పవన్ కల్యాణ్ విడుదల చేసిన చికిత్స ఫొటో పక్కన వివాదాస్పద నటి శ్రీరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ పక్కన కూర్చుని శ్రీరెడ్డి సేవలు చేస్తున్నట్లుగా ఉన్నది ఆ ఫొటోలో.
పవన్ కల్యాణ్, శ్రీరెడ్డి ఫొటో ను రామ్ గోపాల్ ట్విట్టర్ లో పెట్టి ట్రోలింగ్ చేస్తున్నారు.
దీనిపై పవన్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. శ్రీరెడ్డి కూడా తనను పవన్ కల్యాణ్ ను కలిపిన రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు తెలుపుతున్నారు.
కరోనా సోకిన వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? వకీల్ సాబ్ చిత్ర యూనిట్ లో ఆ సినిమా నిర్మాత దిల్ రాజుతో సహా చాలా మందికి కరోనా వచ్చింది.
అదీ కాదు.. కరోనా వచ్చిందా లేదా అనేది ఇక్కడ మనం తేల్చేది కాదు.
ఒక వ్యక్తి కరోనా వచ్చిందని అంటే దాన్ని అవహేళన చేస్తావా?
నీకు పవన్ కల్యాణ్ తో విభేదాలు ఉంటే అది వేరే విధంగా తేల్చుకో రామ్ గోపాల్ వర్మ, కరోనా వచ్చిన క్లిష్ట సమయంలో ఒక వ్యక్తిని మార్ఫింగ్ ఫొటోలతో అవహేళన చేస్తావా?
అసలు నువ్వు మనిషివేనా????