మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విలేకరులకు నిత్యావసరాలు అందచేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లో పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ.. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తన సేవా తత్పరతను చాటుకుంటుంది.
ఇందులో భాగంగా మంగళవారం సంస్థ అధ్యక్షురాలు కళావతి ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రముఖ గైనకాలజీ నిపుణురాలు డాక్టర్ నాగలక్ష్మి చేతుల మీదుగా విలేకరులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాకర్ల బాలకృష్ణారెడ్డి, జర్నలిస్టు రమేష్ కాకర్ల, శ్రీధర్, వైద్యురాలు కాత్య, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.