మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ జమ్మిగడ్డ బి జె ఆర్ కాలనీ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు ఎస్ ఏ రహీం నివాసంలో మంగళవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.
ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు మతసామరస్యానికి దోహదం చేస్తాయని అన్నారు ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా కొలిచే ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి ఈ రంజాన్ మాసంలోనే వచ్చిందని నమ్ముతారని అన్నారు. అందుకే ఈ పండుగ ముస్లిం సోదరి, సోదరీమణులకు చాలా పవిత్రమైందన్నారు. ఈ పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో మానవులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శకాలు, సత్య మార్గాలు ఉంటాయన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి