26.7 C
Hyderabad
May 12, 2024 10: 30 AM
Slider హైదరాబాద్

బిజెఆర్ కాలనీ అధ్యక్షులు రహీమ్ నివాసంలో ఘనంగా రంజాన్ వేడుకలు

#asraonagar

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్  జమ్మిగడ్డ బి జె ఆర్ కాలనీ అధ్యక్షులు ప్రముఖ సంఘ సేవకులు ఎస్ ఏ రహీం నివాసంలో మంగళవారం రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు.

ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పండుగలు మతసామరస్యానికి దోహదం చేస్తాయని అన్నారు ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా కొలిచే ఖురాన్ గ్రంథం స్వర్గం నుంచి భూమికి ఈ రంజాన్ మాసంలోనే వచ్చిందని నమ్ముతారని అన్నారు. అందుకే ఈ పండుగ ముస్లిం సోదరి, సోదరీమణులకు చాలా పవిత్రమైందన్నారు. ఈ పవిత్రమైన ఖురాన్ గ్రంథంలో మానవులను సన్మార్గంలో నడిపించే మార్గదర్శకాలు, సత్య మార్గాలు ఉంటాయన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ఎం‌పి రవి కార్యాలయంపై ఈడి దాడులు

Murali Krishna

హిమాచల్ గవర్నర్ గా దత్తాత్రేయ ప్రమాణం

Satyam NEWS

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు లక్ష్యంగా పనిచేయాలి

Satyam NEWS

Leave a Comment