18.7 C
Hyderabad
January 23, 2025 03: 06 AM
Slider జాతీయం

కం టు ఆఫీస్:నటి రశ్మికా కు ఐటీ శాఖ నోటీసులు

rasmika it notice

ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు కేసులో ఈ నెల 21మంగళవారం బెంగళూరులోని ఐటీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సినీనటి రశ్మికాతో పాటు ఆమె తండ్రి మదన్, తల్లి సుమన్‌కు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. నటి రశ్మికా మందన్న నివాసంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు ఇటీవల దాడులు జరిపారు.

ఇందులో కొడగు జిల్లా విరాజపేటెలో ఉన్న రశ్మికా నివాసం, వారి కుటుంబానికి చెందిన కల్యాణ మండపం, కార్యాలయంపై ఐటీ అధికారులు సోదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదాయం కంటే ఎక్కువ ఆస్తులు ఉన్నట్లు గుర్తించి, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని మదన్‌ చెప్పారు. ఆస్తులన్నీ చట్టబద్ధమైనవేనని, ఐటీ విచారణకు హాజరవుతామని ఆయన చెప్పారు

Related posts

ఎంఎల్ఆర్ఐటీలో ఐషాకు ఘ‌న స‌త్కారం

Satyam NEWS

విజయనగరంలో ‘అమ్మ ఒడి’కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కు కోపం వచ్చింది..!

Satyam NEWS

మేడారం మినీ జాతరలో కరోనా వైరస్ కలకలం

Satyam NEWS

Leave a Comment