అంతర్వేది లో రథం తగలబడిన ఘటన, ఉద్రిక్తతలు తలెత్తిన నేపథ్యంలో గురువారం అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి రథం ను కళ్యాణదుర్గం డిఎస్పీ వెంకటరమణ, రూరల్ సీఐ రాజా, ఎస్ఐ రాఘవేంద్రప్ప లు పరిశీలించారు.
రథం పరిసరాలు, భద్రత పై సమీక్షించారు. సమీపంలో సిసి కెమెరాలు, తదితర విషయాలపై ఆరా తీశారు. రథం పరిసరాలపై నిఘా ఉంచాలని స్థానిక పోలీసులకు డిఎస్పీ ఆదేశించారు.