తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బహిష్కృత 3వ, వార్డ్ కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి శనివారం ఉదయం టి.పి.సి.సి అధ్యక్షుడు,నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఉత్తమ్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సంపత్ రెడ్డి ని అతని అనుచరులకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.