తనను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ, తనపై వస్తున్న పుకార్ల మీద స్పష్టత ఇస్తూ నియోజకవర్గ ప్రజలకి పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు. నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలకు, నా అభిమానులకు, శ్రేయోభిలాషులకు, నమస్కారం… అంటూ లేఖ మొదలుపెట్టి… “పర్చూరు నియోజకవర్గం నుంచి గత రెండు పర్యాయాలుగా మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి శాసనసభ్యునిగా ఎన్నుకున్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం నాతో పాటు రెండు పర్యాయాలు అందరూ అహర్నిశలు శ్రమించారు. నాటి నుండి ప్రతి క్షణం, ప్రతి ఆలోచన పర్చూరు నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు మనందరం సమిష్టిగా పని చేశాం. వ్యాపారం లో విజయం సాధించాక రాజకీయ రంగం లోకి వచ్చాను! అధికార పార్టీ మైండ్ గేమ్ లో పడను! ఒత్తిడి వుంది, కానీ కండువా మార్చే ప్రసక్తి లేదు పుకార్లు నమ్మవద్దు అంటూ పర్చూరు నియోజక వర్గ కార్యకర్తలకు బహిరంగ లేఖ రాసారు సాంబశివరావు.