28.2 C
Hyderabad
May 9, 2024 02: 02 AM
Slider జాతీయం

రెస్ట్ లెస్:కోర్టురూమ్‌లోనే సొమ్మ‌సిల్లిన నిర్భ‌య జ‌డ్జి

nirbhaya judge ill helth fell down in court hall

నిర్భ‌య కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు జ‌డ్జి ఆర్ భానుమతి కోర్టురూమ్‌లోనే సొమ్మ‌సిల్లి ప‌డిపోయారు. నిందితుల‌ను వేరువేరుగా ఉరితీయాల‌ని కేంద్ర వేసిన పిటిష‌న్‌ను ఆమె ఇవాళ విచారించారు. ఆ కేసులో వాదోప‌వాదాలు నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో జ‌డ్జి భానుమ‌తి కోర్టులోనే కొన్ని నిమిషాల పాటు సొమ్మ‌సిల్లిపోయారు.

ఆమెను హుటాహుటిన చాంబ‌ర్‌లోకి తీసుకువెళ్లారు. వెంట‌నే ఆ కేసును వాయిదా వేస్తున్న‌ట్లు బెంచ్ ప్ర‌క‌టించింది. ఆర్డ‌ర్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌న్నారు. జ‌స్టిస్ భానుమ‌తికి తీవ్ర జ్వ‌రం ఉన్న‌ద‌ని, చాంబ‌ర్‌లో డాక్ట‌ర్లు ఆమెను ప‌రిశీలిస్తున్నార‌ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా తెలిపారు.

మ‌రోవైపు నిర్భ‌య కేసులో దోషిగా ఉన్న విన‌య్ కుమార్ శ‌ర్మ పెట్టుకున్న క్ష‌మాభిక్ష పిటిష‌న్‌ను కోర్టు కొట్టిపారేసింది. వైద్య నివేదిక‌ల ప్ర‌కారం విన‌య్ మాన‌సికంగా స్థిరంగా ఉన్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది.

Related posts

వ్యాక్సిన్ గురించి అవగాహన కల్పించిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

(Free|Sample) Natural Treatment For High Blood Sugar Byetta Diabetes Medicines

Bhavani

ఎట్టకేలకు తెరచుకున్న ప్రెస్ క్లబ్…డీపీఆర్ఓ ఏడీ ఆధ్వర్యంలో సమావేశం..!

Satyam NEWS

Leave a Comment