దేశ రాజధాని ఢిల్లీ ప్రజలు కొలిమిలో పడ్డ శలభాల్లా మాడిపోతున్నారు. గత ఆరు రోజులుగా పెరిగిపోతున్న పగటి ఉష్ణోగ్రతలతో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. గత 72 ఏళ్లలో ఏప్రిల్ నెలలో ఇంత ఉష్ణోగ్రత నమోదు కాలేదు. ఈ ఏడాది ఏప్రిల్లో రాజధానిలో ఇప్పటి వరకు ఐదు హీట్వేవ్ రోజులు నమోదయ్యాయి. 2017 ఏప్రిల్లో ఇలాంటి ఆరు రోజులు నమోదయ్యాయని IMD డేటా చూపించింది. ఏప్రిల్ 21, 2017న రాజధానిలో గరిష్టంగా 43.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్ 29, 1941న 45.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. మళ్లీ ఇప్పుడు అంత ఉష్ణోగ్రత రికార్డు అయింది.
previous post