36.2 C
Hyderabad
May 14, 2024 18: 51 PM
Slider హైదరాబాద్

సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలి

#amberpet

అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ లోని బిలాల్ మజీద్ లైన్ లో 28 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతన సివరేజి పైప్ లైన్, నూతన సీసీ రోడ్డు పనులను అంబర్ పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు అంబర్ పేట కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే పటేల్ నగర్ నరేంద్ర నగర్ లో స్థానిక సమస్యలపై స్థానిక బస్తీ ప్రజలతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించి, వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఏఈ కుషాల్, వర్క్ ఇన్స్పెక్టర్ దుర్గ, కాంట్రాక్టర్ మరియు స్థానిక బస్తి ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

నిర్మల్ పట్టణంలో తడి పొడి చెత్త ఇక సపరేటు

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

Satyam NEWS

లేపాక్షి ఆలయానికి యునెస్కో గుర్తింపు త్వరలో

Satyam NEWS

Leave a Comment