తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ఆ పదవిలో కొనసాగే హక్కు లేదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు.
సోమేశ్ కుమార్ ఏపీ క్యాడర్ కు చెందిన అధికారి అని, తన మాట వింటాడనే ఉద్దేశ్యంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను ఎంపిక చేసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు.
IAS అధికారిగా ఉన్న సోమేశ్ కుమార్ ఉద్యోగం వదిలి బయట ఉద్యోగం చేశారని, ఉద్యోగం వదిలి మళ్ళీ వస్తే 8 ఏళ్ళు విధుల నుంచి తొలగించాలి కానీ అలా చేయలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
భూ కుంభకోణంలో సీఎస్ సోమేశ్ కుమార్ పాత్ర ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సోమేశ్ కుమార్ పై కోర్టులో కేసు ఉందని అయితే ఆ కేసు ఫైల్ కనిపించడం లేదని రేవంత్ రెడ్డి తెలిపారు.