కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో బాగంగా శనివారం ధ్వజారోహణంతో వేద పండితులు ముక్కోటి దేవతలను ధ్వజ పటం ఎగురవేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు.
మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ వేడుకగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆలయ బ్రహ్మోత్సవాల కమిటీ మేడా భాస్కర్ రెడ్డి,మేడా విజయ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఖానుస ఆగమ శాస్త్రం ప్రకారం ధ్వజారోహణం నిర్వహించారు. విశ్వసేనుని పూజా, పుణ్యా అవాచనం,గరుడ ప్రతిష్ట,అగ్ని ప్రతిష్ట,సర్వ దేవతా ఆహ్వానం అభిషేకం,హారతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు పాల్గొనగా, పాల్గొన్న భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలు అందించారు.ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసారు.అలయంను పరిసర ప్రాంతాల్లో రంగు రంగుల లైటింగ్ బోర్డులను ఏర్పాటు చేశారు.