28.7 C
Hyderabad
May 5, 2024 10: 16 AM
Slider ప్రత్యేకం

24 గంటల కరెంట్ నిరూపిస్తే నామినేషన్ విత్ డ్రా

#revanthreddy

కామారెడ్డి కార్యకర్తల సమావేశంలో రేవంత్ రెడ్డి సవాల్

రాష్ట్రంలో 24 గంటల కరెంట్ సరఫరా చేసేది నిజమేనని రుజువు చేస్తే కామారెడ్డి, కొడంగల్ లో తన నామినేషన్ ఉపసంహరించుకుంటానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు సవాల్ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని క్లాసిక్ ఫంక్షన్ హాలులో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కామారెడ్డిలో మిడతల దండు, దండుపాళ్యం ముఠాను తరిమికొట్టాలన్నారు.

ఈ ఎన్నిక కామారెడ్డి, తెలంగాణకు మాత్రమే చెందినది కాదని, దేశ చరిత్రలో కీలక మలుపు తిప్పే ఎన్నిక అని, గర్వానికి, అగర్వానికి మధ్య ఎన్నిక అని తెలిపారు. ప్రజలను మభ్య పెట్టి, డబ్బులు, మద్యంతో కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఎన్నికలో గెలవాలని ప్లాన్ చేస్తున్నాడని పేర్కొన్నారు. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్రంలో గత ఆరు నెలలుగా ఉచిత కరెంట్ ఇస్తున్నట్టుగా నిబద్ధత ఉంటే చర్చకు రా కేసీఆర్ అంటూ సవాల్ చేశారు.

సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్, కామారెడ్డి ఎక్కడికైనా వస్తా.. నీ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని తీసుకుని కామారెడ్డి అమరవీరుల స్తూపం వద్దకు రా.. 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్టు నిరూపిస్తే కామారెడ్డి, కొడంగల్ లో నామినేషన్ ఉపసంహరించుకుంటా.. నా సవాల్ కు కేసీఆర్ సిద్ధం కావాలి.. మధ్యాహ్నం 3 గంటల దాకా సమయం ఇస్తున్నానని సవాల్ చేసారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ బంద్ అవడం కాదు.. మీ ఒంట్లో, మీ ఇంట్లో కరెంట్ తీసేస్తామని, అప్పుడు దేవదాసులా గజ్వేల్ ఫార్మ్ హౌస్ లో మందేసి చెట్ల మధ్య తిరగాలన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు.. కరువు వస్తుంది.. కర్ఫ్యూ వస్తుందని చెప్తున్న జాతకాలు ఏమైనా చెప్తున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఎక్కడికెళ్లినా 24 గంటల కరెంట్ గురించి మాట్లాడరని, నిరుద్యోగులకు ఉద్యోగాల గురించి మాట్లాడరని, మిషన్ కాకతీయ మీద మాట్లాడితే కమీషన్ల గురించి మాట్లాడతారని భయపడతారని, కాళేశ్వరం గొప్పలు చెప్పడం లేదని, సుందిళ్ళ, కుంగిన మేడిగడ్డ గురించి ప్రశ్నిస్తారని భయపడుతున్నారన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ఊసెత్తడం లేదన్నారు.

కర్ణాటకలో 5 గ్యారెంటీలు అమలు చేయనివాళ్ళు ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేస్తారా అని అడుగుతున్నారని, కర్ణాటకలో కాంగ్రెస్ ఓడితే బీజేపీని గెలిపించాలి అనుకున్నవా కేసీఆర్ అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ, ఎంఐఎం కలిసి బీఆర్ఎస్ గెలుపుకు కంకణం కట్టుకున్నాయన్నారు. నాడు రబ్బరు చెప్పులతో తిరిగే హరీష్ రావు విమానాల్లో తిరుగుతున్నారని, బంతిపూలతో బతుకమ్మ పేర్చుకుని తిరిగే కవితమ్మ నేడు బెంజ్ కార్లలో తిరుగుతూ ప్లాస్టిక్ పూల బతుకమ్మలు తెచ్చిందని, అమెరికాలో బాత్ రూంలు కడిగే కేటీఆర్ నేడు విమానాలో తిరుగుతున్నారన్నారు.

2014 కు ముందు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు ఎన్నికల అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు, నేటి అఫిడవిట్ ఆస్తులపై, నాడు చెప్పులు లేకుండా తిరిగిన కేసీఆర్ కు నేడు ప్రత్యేక విమానాలు, టివి, పత్రికలు ఎలా వచ్చాయో నాడు నేడుపై చర్చకు సిద్ధమా కేసీఆర్ అని ప్రశ్నించారు. పిసిసి చీఫ్ హోదాలో రాష్ట్రమంతా తిరిగే బాధ్యత నాపై ఉందని, ఏమాత్రం సమయం దొరికినా కామారెడ్డి వస్తానని, ప్రతి ఒక్క కార్యకర్త ఒక రేవంత్ రెడ్డి కావాలని ప్రతి ఇంటిని తట్టి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి ఎన్నిక రాష్ట్ర భవిష్యత్తును మలుపు తిప్పబోతుందన్నారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

విద్య‌ల న‌గ‌రంలో టెన్త్ క్లాస్ స్టూడెంట్ అదృశ్యం….!

Satyam NEWS

పెరిగిన నిత్యవసర దరలను వెంటనే తగ్గించాలని డిమాండ్

Satyam NEWS

అక్రమ సంబంధం పర్యవసానంగా వివాహితపై విచక్షణారహిత దాడి

Satyam NEWS

Leave a Comment