పెరిగిన నిత్యావసర ధరలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ తోపుడు బండిపై టూ వీలర్ ను ఊరేగిస్తూ పెరిగిన నిత్యవసర దరలను వెంటనే తగ్గించాలని చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్డి మాండ్ చేశారు. శుక్రవారం మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ ఇంచర్జ్ గా ఉన్న గట్టుప్పల్ మండల కేంద్రంలో కేటీఆర్ అన్న ఆదేశాల మేరకు
స్థానిక నాయకులతో కలిసి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ 400 బైక్ లతో ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మోదీ ప్రధాన మంత్రి అయిన నాటి నుంచి క్రూడయల్ ధరలు ఏ మాత్రం పెరగలేదని,అయిన కూడా పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజలకు భారంగా మారారని , తోపుడు బండిపై టూ వీలర్ ను ఊరేగిస్తూ వినూత్నంగా నిరసన తెలిపామని, ధరలు పెంచుతూ పోతే భవిష్యత్ ఇలాగే ఉంటుందని తెలిపారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి