స్థిరమైన ఉద్యోగం… భార్యా పిల్లలు… కొత్త ఇల్లు… ఇంకేం కావాలి? ఏమీ అవసరం లేదు…. అయితే విధి వక్రించింది….. అన్నీ ఉన్న అతడిని అర్ధంతరంగా తీసుకుపోయింది.
హెడ్ కానిస్టేబుల్ మాడబోయిన తిరుపతి (45) హృదయవిదారక కథ ఇది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మామునూరు పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న మాడబోయిన తిరుపతి ఆదివారం స్వగ్రామమైన ములుగు మండలం జంగాలపల్లికి కి ద్విచక్రవాహనంపై వెళుతున్నాడు.
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మ మ కూర్ మండలం నీరుకుల్లా క్రాస్ దాటిన తర్వాత ములుగు వైపు వెళ్తున్న లారీ మృత్యువులా దూసుకువస్తుందని ఊహించలేకపోయాడు. రోడ్డు పక్కన ఆగి ఉండగా వెనక నుంచి లారీని ఢీకొని అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య రమ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడు తిరుపతి స్వగ్రామమైన జంగలపల్లి ల్లో నూతనంగా ఇల్లు నిర్మించాడు.
ఆ ఇల్లు నిర్మాణం దాదాపు పూర్తి అయ్యింది. ఈ నెల 25 గృహ ప్రవేశం చేయవలసి ఉంది. ఇంతలోనే రోడ్డు ప్రమాదం తిరుపతి మృతి చెందడం జంగాల పల్లి గ్రామం విషాద ఛాయలు అలుముకున్నాయి