ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులు ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వివిధ శాఖల సమస్యల పరిష్కారం పై వచ్చిన 52 ఫిర్యాదులను కలెక్టర్ ఉదయ్ కుమార్ స్వీకరించారు. వచ్చిన ఫిర్యాదును వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలపై ధరణిలో నమోదు చేసుకున్న సమస్యల పరిష్కారంకై వచ్చిన 60 దరఖాస్తులను జిల్లా కలెక్టర్ అప్పటికప్పుడే దరఖాస్తుదారుని ముందరే కంప్యూటర్లో నేరుగా పరిష్కరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు చొరవ చూపాలన్నారు. ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, డిఆర్డిఏ పిడి నర్సింగరావు, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి భూపాల్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post