రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి పెను ప్రమాదం తప్పింది.
సీఎం కేసీఆర్ పర్యటన అనంతరం మంత్రి హరీష్ రావు సిద్ధిపేట నుండి హైదరాబాద్ వెళుతున్న క్రమంలో సిద్ధిపేట నాగుల బండ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
అకస్మాత్తుగా రోడ్డు పైకి ఎడమ వైపు నుండి అడవి పందుల గుంపులు రావడం తో ఒక్క సారిగా కాన్వయ్ నెమ్మది కావడం తో కాన్వాయ్ లోని కారులు ఒకదానికటి ఢీకొన్నాయి.
మంత్రి కూర్చున్న కారు, సెక్యూరిటీ వాహనాలు కొంత డ్యామేజ్ జరిగింది. మంత్రికి, సిబ్బంది కి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
వేరే వాహనం లో మంత్రి సురక్షితంగా హైదరాబాద్ చేరుకున్నారు. తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని మంత్రి ట్విట్టర్ లో వెల్లడించారు.