హైదరాబాద్ లో పనులు దొరక్క ఇంటికి వెళ్దామనుకున్న కూలీలు ఆసుపత్రి పాలయ్యారు. ఈ దయనీయమైన సంఘటన నల్గొండ జిల్లా నకరేకల్ ఇనుపాముల బైపాస్ రోడ్డు వద్ద జరిగింది. హైదరాబాద్ నుండి అద్దంకి వెళుతున్న వలస కూలీల వాహనాన్ని విజయవాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
దాంతో అశోక్ లేలాండ్ ఆటో లో ప్రయాణిస్తున్న దాదాపు 20 మంది కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో నలుగురికి కాళ్ళు విరిగాయి మరో ఇద్దరికీ తలలు పగులాయి. ప్రమాదానికి గురైన వారిలో నలుగురికి పైగా చిన్నపిల్లలు ఉన్నారు.
వీరంతా హైదరాబాద్ చుట్టుపక్కల లో ఇటుక బట్టీల్లో పనిచేసే కూలీలు. కరోనా ఉండడంవల్ల పనులు లేక వారు అంతా హైదరాబాద్ నుండి అద్దంకి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. రెండు 108 వాహనాలు, ఒక హైవే అంబులెన్స్ లో వారిని నకరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
హైదరాబాద్ నుంచి నార్కెట్ పల్లి మీదుగా అద్దంకి వెళ్ళవలసి ఉంది కానీ నీ ఆటో డ్రైవర్ కి రూట్ మ్యాప్ తెలియకపోవడంతో గూగుల్ మ్యాప్ ని అనుసరిస్తూ రూటు తప్పి విజయవాడ వైపు వచ్చారు. నకిరేకల్ మండలం ఇనుపాముల టర్నింగ్ వద్ద నిద్రమత్తులో లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన డంతో అమాంతం రోడ్డు నుండి దాదాపు 10 మీటర్ల వరకు ఆటో వెళ్లి ఉంది. ఆటో లో పరిమితికి మించి కూలీలు ఉండడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరించారు.