హైదరాబాద్ శివారులోని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని 8 వ డివిజన్ లో మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్ లేతాకుల మాధవి రఘుపతిరెడ్డి తో కలిసి పర్యటన కరోనా వైరస్ పై ప్రజలకు అవగాహనా కల్పించారు.8 వ డివిజన్ మెయిన్ రోడ్ లో కబ్జాకు గురైన రోడ్ స్థలాన్ని కాపాడి కొత్త రోడ్ నిర్మిస్తామన్నారు.
అనంతరం పేదలకు భోజన ప్యాకెట్ లను పంపిణి చేసారు.ఈ సందర్బంగా మేయర్ మాట్లాడుతూ లాక్ డౌన్ సమయం లో డివిజన్ ప్రజలకు కార్పొరేటర్ విశేష సేవలందిస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ అమరసింగ్ డివిజన్ నాయకులు ..సాయి లోకేష్ ,సురేష్ శ్రీనివాస్, సాగర్ చైతన్య ,కిష్ణగౌడ్, ఉపేందర్ రెడ్డి ,స్వామి, లక్ష్మి నారాయణ , బాగయ్య , ప్రమోద్ ప్రదీప్ , మహేందర్, గోపి , మైపాల్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.